Friday 27 November 2015

అక్కడ మద్యం నిషేధం .....



 బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తన ఎన్నికల హామీల అమలుకు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం -ఎక్సైజ్ డే వేడుకల్లో సీఎం నితీశ్ ప్రకటన అమలు చేయనున్నట్లు గురువారం ఎక్సైజ్ డే కార్యక్రమంలో చెప్పారు. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయం వస్తున్నా, పేదలు, మహిళల ప్రయోజనాల రీత్యా మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. తదనుగుణంగా కొత్త మద్యవిధానం అమలులోకి తేవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజనీకుమార్ సింగ్, ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి కేకే పాఠక్‌లను ఆదేశించారు. మద్యపానం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందు ఉన్న స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. నితీశ్‌ను చంపేస్తా: టీవీ చానెల్‌కు బెదిరింపు ఎస్సెమ్మెస్ సీఎం నితీశ్‌కుమార్‌ను బాంబులతో చంపేస్తామని పేర్కొంటూ ఓ వ్యక్తి గురువారం పాట్నాలోని కాశిష్ అనే ప్రైవేట్ టీవీ చానెల్‌కు మొబైల్ ఫోన్ నుంచి ఎస్సెమ్మెస్ పంపాడు. దీంతో సీఎం నితీశ్‌కుమార్‌కు భద్రతను పెంచారు .

జుబ్లిహిల్ల్స్ సాక్షిగా అక్రమంగా తన వర్గం వారికీ దోచిపెట్టిన బాబు..!!!

తెలంగాణ రాష్ట్రం లో కొంతమంది రాజకీయ నాయకుల మాటలు ,విమర్శలు చూస్తుంటే వారికీ చింత సచ్చిన పులుపు చావలేదు అన్న సామెత గుర్తుకు వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి . ఎందుకంటే గతం లో ఉమ్మడి రాష్ట్రం లో దాదాపు తొమ్మిది ఏండ్లు అధికారంలో ఉన్న పసుపు పార్టీ నేతలు అప్పుడు ప్రజలు ,రైతులు గుర్తుకు రాకుండా ఎన్నో ఉద్యమాలు ,ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం లో తెరాస పార్టీ అధికారం లోకి వచ్చి కనీసం రెండి ఏండ్లు అయిన కాకుండా తెలంగాణ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది ,తెలంగాణ రాష్ట్ర మంత్రులు అవినీతి అక్రమాలకి పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఉదయం లేచిన దగ్గర నుండి తమ ఆస్థాన మీడియా లో ఒకటే పత్రిక ప్రకటనలు ,విమర్శలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అటు రాజకీయ నేతలకి మస్తు కామిడి అందిస్తున్నారు అందరు .

ఉమ్మడి రాష్ట్రం లో అధికారం లో ఉన్న పసుపు పార్టీ తము అధికారం లో ఉన్న తొమ్మిది ఏండ్లు అభివృద్ధి పేరు తో తెలంగాణ రాష్ట్రాన్ని ,ముఖ్యంగా హైదరబాద్ నగరం చుట్టూ ఉన్న భూములని ఆక్రమించుకున్నారు . పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి  ఉదయం లేస్తే తను చెప్పే మాట హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటం లో నిలిపాను అని. కానీ అయన హైటెక్ పేరు తో కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములని తన సామజిక వర్గానికి ముఖ్యంగా తన బినామిలకి దోచి పెట్టాడు అన్నది జగమెరిగిన సత్యం . హైటెక్ సిటీ కి అతి సమీపాన ఉన్న ప్రాంతాలలో ప్రముఖ సినిమా ఫైనాసియర్,ప్రముఖ నిర్మాత అయిన ఒక వ్యక్తికీ కొన్ని వందల కోట్లు విలువ చేసే భూమిని సదర్ వ్యక్తికీ కట్టబెట్టి తనకి అందినకాడికి ఆయనకి కట్టబెట్టారు . ఇప్పుడు అయన కొన్ని భారి సినిమాలకి పైసలు పెట్టె స్థాయికి ఎదగాడు . అంతే కాకుండా సదర్ వ్యక్తి ఆస్తులు కూడా కొన్ని వేల కోట్లు ఉంటాయి అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం . త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ నేతలకి ఆయనే డబ్బులు అందజేయనున్నాడని సమాచారం …